యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు చిత్రసీమలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా బాహుబలి సినిమాతో తెలుగు చిత్రసీమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ప్రస్తుతం రాధా కృష్ట కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే సినిమాలో చేస్తున్న ప్రభాస్.. తాజాగా తన 22 వ సినిమాను ప్రకటించాడు.
సోమవారం రాత్రి ప్రభాస్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ న్యూస్ చెప్పాడు. మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటిస్తానని చెప్పాడు. చెప్పినట్లే ప్రభాస్.. మంగళవారం ఉదయం తన కొత్త సినిమా ‘ఆదిపురుష్’అని అనౌన్స్ చేశాడు. ‘తనాజీ’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు ప్రభాస్ ప్రకటించాడు. ఈ సినిమాకు సబంధించిన ఒక పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు. ‘చెడు మీద మంచి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ పోస్టర్ లో రాముడు, హనుమంతుడు, పది తలల రావణుడు వచ్చేలా డిజైన్ చేశారు. ఇందుకోసం ‘ఆదిపురుష్’లోని మొదటి అక్షరం ‘A’ని హైలైట్ చేశారు. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 3డీ ఫార్మాట్ లో ఈ సినిమాను టీసిరీస్ నిర్మించనుంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా.. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు.
For More News..