
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధ(Radha) కూతురు, జోష్(Josh) మూవీ హీరోయిన్ కార్తీక(Karthika) పెళ్లికి రెడీ అయ్యారు. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ తంతు కూడా ముగిసిందని తెలుస్తోంది. కారణం కార్తీక రీసెంట్ తన ఇన్స్టా పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్ లో కార్తీక ఓ వ్యక్తిని కౌగిలించుకోని కనిపించారు. అంతేకాడు ఆమె చేతికి ఓ ఖరీదైన ఉంగరం కూడా కనిపించింది. ఈ ఫోటోలో వారిద్దరి మొహాల కంటే.. ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేశారు. ఇక ఈ ఫొటోకు.. ఏ నెగెటివ్ ఎనర్జీ తమను తాకకూడదని ఈగల్ ఐ ఎమోజీని యాడ్ చేశాము అనే క్యాప్షన్ ఇచ్ఛారు. దీంతో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని, ఆ జంటకు భారీ ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్స్.
కొంత కాలంగా కార్తీక పెళ్లిపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కార్తీక ఈ పోస్ట్ పెట్టడంతో ఆమె పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అయితే కార్తీకను పెళ్లాడబోతున్న వరుడు ఎవరు అనే విషయంపై, అలాగే ఎంగేజ్మెంట్ విషయంపై కార్తీక కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకట రాలేదు.
ఇక కార్తీక చేసిన సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాతో హీరోయినా గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము, అల్లరి నరేష్ బ్రథర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించారు. అవేవి కూడా ఆశించినంతగా ఆడకపోవడంతో ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.