MythriMovieMakers: అజిత్తో మూవీ..భారీగా ప్లాన్ చేసిన మైత్రి మేకర్స్..డైరెక్టర్ ఎవరంటే?

MythriMovieMakers: అజిత్తో మూవీ..భారీగా ప్లాన్ చేసిన మైత్రి మేకర్స్..డైరెక్టర్ ఎవరంటే?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అజిత్ కుమార్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయనున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ బ్యానర్..స్టార్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి  గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాను విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కిస్తున్నారు.అంతేకాకుండా ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ కథ కూడా అందిస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..”దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్‌తో కలిసి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నా, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్ అలాగే స్క్రీన్ ప్లే చాలా చక్కగా కుదిరాయి. అజిత్ అభిమానులు సినిమా ప్రేమికులకు సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము' అంటూ వెల్లడించారు.  

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ 2025లో ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆయన విడముయార్చి అనే సినిమా చేస్తున్నారు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల తరువాత అజిత్, గోపీచంద్ మలినేనితో సినిమా ఉండనుందని సమాచారం.