న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా జన గణనలో కుల గణన చేపట్టాలని దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఏప్రిల్ 29న విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై కానిస్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాలని 2020లో ఆర్. కృష్ణయ్య పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్తో పాటు.. కులగణన అంశంపై దాఖలైన ఇతర అన్ని పిటిషన్లను సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ విచారించింది. వీటిపై కేంద్రం కౌంటర్ దాఖలు చేయగా, రిజాయిండర్లు దాఖలుకు పిటిషనర్లకు కోర్టు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.