ఆర్థిక ఇబ్బందులతో అడ్వకేట్ సూసైడ్

ఆర్థిక ఇబ్బందులతో అడ్వకేట్ సూసైడ్

గండిపేట, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో అడ్వకేట్ సూసైడ్ చేసుకున్న నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన సునీల్‌ కుమార్‌ ముఖర్జీ(41) అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. 

భార్య కొంతకాలంగా అతడికి దూరంగా ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలు తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. డెడ్ బాడీని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.