బెదిరింపులకు భయపడం.. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం : గూడెం మహిపాల్ రెడ్డి

బెదిరింపులకు భయపడం.. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం : గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యానని తాను తప్పు చేస్తే మూడు సార్లు గెలిచే వాళ్ళం కాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయని పూర్తి పర్మిషన్స్ తో తాము క్వారీని నడిపిస్తున్నమని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి మీడియా సమవావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడెం మాట్లాడుతూ

 పటాన్ చెరు నియోజకవర్గంలో గత పదేళ్ళలో ఎవరి మీద కక్ష్య సాధింపు చర్యలు చేపట్ట లేదని గూడెం మహిపాల్ అన్నారు. బెదిరింపులకు భయపడమని తప్పు చేస్తే శిక్ష వేయండని  సూచించారు. కింది స్థాయి నుండి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నమని తప్పుపై ప్రజా కోర్టులో తేల్చుకుంటామని గూడెం మహిపాల్  తెలిపారు.