ఉప్పల్​లో ఇండియా – ఆసీస్​ టీ20 మ్యాచ్‌‌‌‌కు ఎలక్షన్ ఎఫెక్ట్!

ఉప్పల్​లో ఇండియా – ఆసీస్​ టీ20 మ్యాచ్‌‌‌‌కు ఎలక్షన్ ఎఫెక్ట్!

డిసెంబర్ 3న మ్యాచ్, అదే రోజు కౌంటింగ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరల్డ్ కప్ తర్వాత సొంతగడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌ ఆడనుంది. ఇందులో చివరి టీ20ని డిసెంబర్ 3న హైదరాబాద్​ ఉప్పల్ స్టేడియంలో  షెడ్యూల్‌‌‌‌ చేశారు. కానీ, అదే రోజు అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్‌‌‌‌ ఉండటంతో మ్యాచ్‌‌‌‌ నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ టైమ్‌‌‌‌లో  కౌంటింగ్, శాంతిభద్రతలపై పోలీసు శాఖ దృష్టి సారించడంతో మ్యాచ్‌‌‌‌కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేకపోవచ్చని హెచ్‌‌‌‌సీఏ వర్గాలు భావిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో వైజాగ్‌‌‌‌లో ఈ నెల23న జరగాల్సిన తొలి టీ20ని హైదరాబాద్‌‌‌‌కు కేటాయించి, చివరి మ్యాచ్‌‌‌‌ను వైజాగ్‌‌‌‌కు మార్చాలని బీసీసీఐని రిక్వెస్ట్‌‌‌‌ చేయాలని హెచ్​సీఏ ఆలోచన చేస్తోందని సమాచారం. అయితే ప్రస్తుతం ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో సౌత్‌‌‌‌ స్టాండ్‌‌‌‌ పైకప్పు నిర్మాణం, కొత్త కుర్చీల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. దాంతో తొలి టీ20 నిర్వహణ  కూడా సాధ్యం అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది.