తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది:నిరంజన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది:నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.అందుకే  దేశంలోని ప్రధాన పరిశ్రమలన్నీ ఇప్పుడు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని చెప్పారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఎయిర్ పోర్ట్  అందుబాటులో ఉండడంతో దాని పరిసర ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్ లు ఏర్పాటవుతుండటం అభినందనీయమన్నారు. 

శంషాబాద్ విమానాశ్రయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఒడిసి లాజిస్టిక్ హబ్ ను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఫార్మా రంగం ఉత్పత్తులకు తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఒడిస్సి లాజిస్టిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ ఠాకూర్ చెప్పారు.