హైదరాబాద్ లో కలకలం : ఫ్లైఓవర్ కు మోదీ పొలిటికల్ గేమ్ అంటూ ప్లెక్సీ..

హైదరాబాద్ లో కలకలం : ఫ్లైఓవర్ కు మోదీ పొలిటికల్ గేమ్ అంటూ ప్లెక్సీ..

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున పొలిటికల్ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. సిటీకి ప్రధాని మోదీ వస్తున్న సమయంలో రాత్రికి రాత్రి వెలిసిన ఈ ఫ్లైక్సీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఫ్లెక్సీలో ఏముందీ అంటారా.. ఫొటో చూస్తే క్లారిటీ వస్తుంది.

ప్రధాని మోదీ.. కేసీఆర్, ఓవైసీలను తోలు బొమ్మలు ఆడించినట్లు ఆడిస్తున్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ అది.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను ఒక చేత్తో.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మరో చేత్తో దారం పట్టుకుని ఆడిస్తున్నట్లు ఉంది ఈ ఫ్లెక్సీ.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. పంజాగుట్ట సెంటర్ లో వెలిసింది. 

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. అతిక్రమించి.. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీన్ని గమనించిన బీఆర్ఎస్ నేతలు కంప్లయింట్ చేయటంతో.. దాన్ని వెంటనే తొలగించారు.