
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ ఘటనను భయంకరమైనది అన్నారు. ఈ ప్రమాదంలో 53 బ్రిటిష్ పౌరులతో సహా 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం భాధాకరం.. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కీర్ స్టార్మర్. బ్రిటన్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు స్టార్మర్.
బ్రిటన్ హై కమిషన్ ,రాయల్ ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం కలిసి సహాయక చర్యలు చేపట్టి బాధితులకు అండగా ఉన్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Also Read : భారతదేశాన్ని కుదిపేసిన 10 అత్యంత ఘోర విమాన ప్రమాదాలు ఇవే
UK అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. భారత్ లోని అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం తీవ్ర విచారం కలిగించిందన్నారు విదేశాంగ, కామన్వెల్త్ ,అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి డేవిడ్ లామీ. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వాస్తవ పరిస్థితిని అంచనా వేసి మద్దతు అందించేందుకు భారత్ లోని స్థానిక అధికారులతో కలిసి యూకే పనిచేస్తోందన్నారు.