కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వ‌ర‌వ‌ర‌రావుకు చికిత్సలు జరపాలి

కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వ‌ర‌వ‌ర‌రావుకు చికిత్సలు జరపాలి

క‌రోనా వైర‌స్ సోకి అనారోగ్యం పాలైన విరసం నేత వ‌ర‌వ‌రరావును హైద‌రాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాల‌న్నారు ఏఐసీసీ కార్యదర్శి సంప‌త్. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ కార్యదర్శి అమిత్ దేశముఖ్ తో సంప‌త్ సంప్రదింపులు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వరవరరావు దక్షిణ భారత దేశంలోనే గొప్ప పౌర హక్కుల నేత. కరోనా పాజిటివ్ వచ్చి తీవ్రమైన అనారోగ్యంతో ప్రస్తుతం బొంబాయి లోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. ఆయన ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో చికిత్సలు జరపాలి అని అన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ లోకసభ నాయకులు అదిరంజన్ చౌదరి ప్రధాన మంత్రికి లేఖ రాసారు. మాజీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వరవరరావు కు మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లో జరిగేలా చూడాలన్నారు.