అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం

అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం
  • కేటీఆర్ కామెంట్లపై సంపత్ ఫైర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. రేవంత్‌‌‌‌‌‌‌‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండి పడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే ఇప్పుడు నువ్వు, నీ కుటుంబం పదవులు అనుభవిస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడిన మాటలు గుర్తుచేసుకోవాలి. కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ధైర్యముంటే ఫిరాయింపులపై చర్చకు రావాలి. సంతల్లో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొని డ్రామాలు ఆడుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌‌లో రాజీనామా చేయాలి. కేసీఆర్ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. ఆఖరికి స్పీకర్ పదవిని కూడా తక్కువ చేశాడు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కు ఆదరణ తగ్గి, కాంగ్రెస్ పార్టీపై ఆదరణ పెరుగుతోంది..’ అని సంపత్‌‌‌‌‌‌‌‌ అన్నారు.