
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పింది. దీంతో పెను ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ శ్రీకరన్ రెడ్డి స్పాట్ లోనే మృతి చెందాడు. కారులో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు.
మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్ వాసిగా గుర్తించారు. నేరెడ్ మీట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు. యాదగిరిగుట్ట కు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.