పనామా పత్రాల కేసులో ఈడీ ముందు హాజరయ్యారు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్. ఢిల్లీ జామ్నగర్ హౌస్లోని ఈడీ కార్యాలయంలో విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు అధికారులు. పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యకు రెండు సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశీ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో సమయం కావాలని కోరారు ఐశ్వర్య. ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో వెల్లడయ్యింది. పనామా పత్రాల్లో ఐశ్వర్య సహా భారత్కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం
మహిళలపై అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు
ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం