- నానావతి హాస్పిటల్కు తరలింపు
- వైద్యుల పర్యవేక్షణ అవసరం అవడంతోనే హాస్పిటల్కి
ముంబై: వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్న బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యలు హాస్పిటల్లో చేరారు. వైద్యుల సూచనతో ఇంట్లో ఉన్న వారు.. ప్రస్తుతం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే చేరారని సమాచారం. ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వారిద్దరు క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఐశ్వర్య, ఆరాధ్యకు ఆదివారమే పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దర్నీ హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. వాళ్ల బంగ్లాను బృహన్ ముంబై అధికారులు సీజ్ చేశారు. కాగా.. కరోనా పాజిటివ్ వచ్చిన అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ నానావతి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్తీసుకుంటున్న విషయం తెలిసింది. వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. జయాబచ్చన్, మిగతా కుటుంబసభ్యులకు నెగటివ్ వచ్చింది.