తమిళ హీరో అజిత్ కు సంబంధించిన పిక్ ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. ఇటీవలే హైదరాబాద్లో తన తమిళ చిత్రం ‘వాలిమై’ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న అజిత్.. తన బీఎండబ్ల్యూ బైక్ పై సిక్కిం కు టూర్ ప్లాన్ వేశాడు. ఈ రోడ్ ట్రిప్ పై ఆల్రెడీ వారణాసి వరకు వెళ్లిపోయాడు. అక్కడ ఓ అభిమానితో అజిత్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారణాసి నుంచి సిక్కిం వెళ్తున్న అజిత్.. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని.. తిరిగి చెన్నై చేరుకుంటాడు. ఇలా ఈ ట్రిప్ లో 4500 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డ్ సృష్టించబోతున్నాడు అజిత్ . ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘వాలిమై’ కు వినోద్ దర్శకుడు. హ్యూమా ఖురేషి ప్రధానపాత్రలో నటిస్తోంది.
