డిజాస్టర్ దర్శకుడితో అఖిల్.. వద్దే వద్దంటున్న ఫ్యాన్స్

డిజాస్టర్ దర్శకుడితో అఖిల్.. వద్దే వద్దంటున్న ఫ్యాన్స్

ఏజెంట్(Agent) సినిమా భారీ డిజాస్టర్ తో రేసులో వెనుకబడిపోయాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akkineni akhil). సురేందర్ రెడ్డి(Surendar reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు దాదాపు రూ.80 కోట్ల భారీ నష్టం వచ్చిందని అంచనా. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ నుండి ఎలాంటి సినిమా రానుంది? ఏ దర్శకుడితో వర్క్ చేయనున్నాడు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

ఇందులో భాగంగానే అఖిల్ ఒక డిజాస్టర్ దర్శకుడితో తన తరువాతి సినిమా చేయనున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు తమిళ దర్శకుడు లింగుస్వామి. ఈ దర్శకుడి గత చిత్రాలన్నీ దాదాపు డిజాస్టర్స్ గా నిలిచినవే. అంతేకాదు లింగుస్వామి(Linguswamy) హిట్టు కొట్టి కూడా చాలా కాలమే అయ్యింది.

Also Read :- తండ్రిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేను: విజయ్ సేతుపతి

అప్పుడెప్పుడో కార్తీ హీరోగా వచ్చిన ఆవారాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత హిట్ కొట్టిన దాఖలాలు లేవు. చాలా కాలం తరువాత ఈమధ్యే రామ్ పోతినేనితో వారియర్ సినిమా తెరకెక్కించాడు ఈ దర్శకుడు. కానీ ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ దర్శకుడు ఇటీవలే అఖిల్ ను కలిసి ఒక లైన్ వినిపించారట. అది అఖిల్ కూడా బాగా నచ్చడంతో ఒకే చెప్పేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఫ్లోప్స్ లో ఉన్నావ్ మళ్ళీ ఈ దర్శకుడితో రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.