పేద పిల్లల విద్యపై కేసీఆర్ కు శ్రద్ధ లేదు

పేద పిల్లల విద్యపై కేసీఆర్ కు శ్రద్ధ లేదు

సీఎం కేసీఆర్ కు విద్యపై ఎంత ప్రేమ ఉందో  RTI లెక్కలు చూస్తే తెలుస్తుందని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. RTI  లెక్కలు ప్రకారం  తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ లో గత 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సుమారు రూ.9,456 కోట్లు విద్యాశాఖ లో ఖర్చు చేయలేదన్నారు. ఆ నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టారని ఆరోపించారు. ఇందులో రాష్ట్రవాటాగా 40శాతం నిధులు ఇస్తే.. కేంద్రం 60శాతం ఇస్తుందన్నారు. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో.. కేంద్రం ఆమోదించిన నిధులు మూలనపడ్డాయని విమర్శించారు. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ నిబద్ధత అంటూ.. ట్వీట్ చేశారు ఆకునూరి మురళి