సీఎం కేసీఆర్ కు విద్యపై ఎంత ప్రేమ ఉందో RTI లెక్కలు చూస్తే తెలుస్తుందని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. RTI లెక్కలు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ లో గత 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సుమారు రూ.9,456 కోట్లు విద్యాశాఖ లో ఖర్చు చేయలేదన్నారు. ఆ నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టారని ఆరోపించారు. ఇందులో రాష్ట్రవాటాగా 40శాతం నిధులు ఇస్తే.. కేంద్రం 60శాతం ఇస్తుందన్నారు. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో.. కేంద్రం ఆమోదించిన నిధులు మూలనపడ్డాయని విమర్శించారు. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ నిబద్ధత అంటూ.. ట్వీట్ చేశారు ఆకునూరి మురళి
RTI ప్రకారం లెక్కలు తీస్తే మన తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ లో గత 8 సం లలో భారత ప్రభుత్వం ఆమోదించిన షుమారు 9456 కోట్లు విద్యా శాఖ లో ఖర్చు చేయకుండా మురగపెట్టిండు. STATE ఇందులో 40% ఇస్తే CENTRAL 60% ఇస్తుంది.
— Murali Akunuri (@Murali_IASretd) July 14, 2022
ఇదీ మన KCR గారి నిబద్దత పేద ప్రజల పిల్లల విద్య మీద. @KTRTRS pic.twitter.com/TK4P9BGPnI