మంచు శివుడు దర్శనం ముగిసింది.. భంభం భోలే..

మంచు శివుడు దర్శనం ముగిసింది.. భంభం భోలే..

రెండు నెలలపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. ఈ ఏడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు.  62 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో  48 మంది మరణించారని, 62 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.  వాతావరణ సంబంధిత, సాధారణ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 

గతేడాది 3.65లక్షల మంది అమర్‌నాథ్‌ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది యాత్ర శాంతియుతంగా, ఎలాంటి ఆంటకాలు లేకుండా సాగిందని అధికారులు తెలిపారు. 

మహంత్‌ దీపేంద్ర గిరి నేతృత్వంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్‌ నుంచి 42కి.మీ దూరం నడిచి అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. అనంతరం చివరి రోజు (గురువారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.