ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిని కాకుండా ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతో ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో స్టాండ్‌ బైలో ఉన్నప్పటికీ రాయుడికి అవకాశం రాలేదు.

క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఇక IPLలో 147 మ్యాచ్‌ లు ఆడి 3,300 పరుగులు చేశాడు. చివరిగా IPL-2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదు చేశాడు రాయుడు.