అమిత్ షా సారీ చెప్పు.. లేదంటే కేసు పెడతా

అమిత్ షా సారీ చెప్పు.. లేదంటే కేసు పెడతా

పుదుచ్చేరి: బలనిరూపణలో కాంగ్రెస్ పార్టీ విఫలమవడంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పక్కనబెడితే పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణ స్వామి అవినీతికి పాల్పడ్డాడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రీసెంట్‌‌గా కామెంట్స్ చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ప్రధాని మోడీ రూ.15 వేల కోట్లు పంపారని, కానీ ఆ డబ్బుల్లో నుంచి కొంత అమౌంట్‌‌ను నారాయణ స్వామి గాంధీ ఫ్యామిలీకి ఇచ్చారని షా ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్వామి ఫైర్ అయ్యారు.

‘ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దమ్ముంటే ఇది నిజమని నిరూపించాలని షాకు సవాల్ విసురుతున్నా. ఒకవేళ ఆయన నిరూపించలేకపోతే ఆయన దేశానికి, పుదుచ్చేరి ప్రజలకు సారీ చెప్పాలి. నాతోపాటు గాంధీ ఫ్యామిలీ ఇమేజీకి డ్యామేజీ కలిగించేలా తప్పుడు, నిరాధార వ్యాఖ్యలు చేసినందుకు షాపై పరువు నష్టం దావా వేస్తా’ అని నారాయణస్వామి పేర్కొన్నారు.