మహారాష్ట్ర నాసిక్లో భూకంపం

మహారాష్ట్ర నాసిక్లో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత .6గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. 

అరుణాచల్ ప్రదేశ్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. బాసర్ కు 58 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఉదయం 7.01 గంటలకు వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు.