గుండెపోటుతో బీటెక్​ స్టూడెంట్​ మృతి

గుండెపోటుతో బీటెక్​ స్టూడెంట్​ మృతి

ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో ఇంజనీరింగ్​స్టూడెంట్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాకు చెందిన ఇస్లావత్​సిద్ధు శేరిగూడలోని శ్రీదత్త కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు.

ఈఈఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్నేహితులు, హాస్టల్​సిబ్బంది కలిసి స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు.