చేవెళ్లలో గెలిపించి మోదీకి కానుకగా ఇస్తం : పి. ఆనంద్

చేవెళ్లలో గెలిపించి మోదీకి కానుకగా ఇస్తం : పి. ఆనంద్
  • మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్ మాదిగ

వికారాబాద్, వెలుగు :  చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిపించి ప్రధాని మోదీకి  కానుకగా ఇస్తామని మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి. ఆనంద్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మాదిగల మద్దతుతో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మంగళవారం బంట్వారం మండలంలో సల్బత్తాపూర్,  వెంకటాపూర్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తానెం నరసింహ మాదిగ, బీజేపీ సల్వాత్తాపూర్ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మార్పీఎస్ నేత శ్రీనివాస్,  నేతలు బాబురావు, భరత్ పాల్గొన్నారు.