హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్

హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్

హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా.. దుండిగల్ లో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.  బౌరంపేట్ కొకొకోలా కంపెనీ దగ్గర వేగంగా వెళ్తున్న కారు.. ముందున్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని సంజు, చరణ్, గణేష్ గా గుర్తించారు.  మద్యం మత్తులో అతివేగంగా కారునడపటం వల్లే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. గాయపడిన యువకుడిని హాస్పిటల్ కు తరలించారు. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. నిజాంపేట్ లో ఉంటూ.. ఉద్యోగం వేటలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అర్థరాత్రి 2 గంటల టైంలో మద్యం తాగి  వేగంగా కారు నడిపారని.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టారని పోలీసులు అంటున్నారు.