ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఇది 59వ సినిమా. తొలిచిత్రం ‘రాజా వారు రాణి గారు’తో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
శనివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదొక రూరల్ యాక్షన్ డ్రామా అని, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మే 9న తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తన 12వ సినిమా చేస్తున్నాడు విజయ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.