నిమ్స్‌‌లో మరో కొత్త బిల్డింగ్‌‌... 8 ఫ్లోర్లు, 3 బ్లాకులు.. 1,500 బెడ్స్

నిమ్స్‌‌లో మరో కొత్త బిల్డింగ్‌‌... 8 ఫ్లోర్లు, 3 బ్లాకులు.. 1,500 బెడ్స్

హైదరాబాద్, వెలుగు:  నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన  చేస్తారని హెల్త్​ మినిస్టర్ హరీశ్‌రావు తెలిపారు. 8 ఫ్లోర్లతో నిర్మించనున్న బిల్డింగ్‌ నమూనాను మంగళవారం విడుదల చేశారు. కొత్త భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ బ్లాకులుంటాయని, మొత్తంగా నిమ్స్​లో మరో 1,500 బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

వీటితో కలిపి బెడ్ కెపాసిటీ 3,700కు చేరుతుందన్నారు. హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియెట్‌లో మంత్రి రివ్యూ చేశారు. కొత్త బిల్డింగ్  శంకుస్థాపనకు ఏర్పాట్లు  చేయాలని, గాంధీ హాస్పిటల్‌ వద్ద నిర్మిస్తున్న 200 బెడ్ల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు.