డీసీఎంను బైక్​ ఢీకొట్టిన ఘటనలో మరొకరు మృతి

డీసీఎంను బైక్​ ఢీకొట్టిన ఘటనలో మరొకరు మృతి

అల్వాల్, వెలుగు :  రోడ్డుపై ఆగిన డీసీఎంను బైక్ ఢీ కొట్టగా బావ బావమరిది మృతి చెందారు. అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్ జిల్లా తూముకుంటకు చెందిన పాండారి నరేందర్ (33), సింగయిపల్లికి చెందిన కొమ్ము నరసింహ(32)  గురువారం సింగాయపల్లి నుంచి జవహర్ నగర్ కు బైక్ పై వెళ్తుండగా ఓ పత్రిక ప్రింటింగ్ ప్రెస్ వద్ద డీసీఎం రిపేరై రోడ్డు మీద ఆగింది.

ఎలాంటి ప్రమాద సూచికలు పెట్టకపోవడంతో చీకట్లో బైక్ తో ఢీకొనడంతో నరసింహ స్పాట్ లో మృతిచెందగా.. నరేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.