
పటియాలా : కుస్తీలో తనకు తిరుగులేదని ఇండియా యంగ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ మరోసారి నిరూపించుకుంది. వరల్డ్ చాంపియన్షిప్స్ ట్రయల్స్లోనూ ఆమె విజేతగా నిలిచింది. ఆసియా గేమ్స్ ట్రయల్స్ ఓటమి నుంచి కోలుకున్న దివ్యా కక్రాన్, సరితా మోర్ కూడా సెప్టెంబరు 16 నుంచి బెల్గ్రేడ్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్స్ బెర్తులు సాధించారు. అండర్20 వరల్డ్ చాంపియన్షిప్ను రెండోసారి గెలిచి రికార్డు సృష్టించిన అంతిమ్ శుక్రవారం జరిగిన 53 కేజీ ట్రయల్స్లోటాప్ ప్లేస్ సాధించింది.
మంజు, పూజా జాట్, రజనీలను ఓడించింది. ఆసియాగేమ్స్ ట్రయల్స్లోనూ నెగ్గిన ఆమె వినేశ్ ఫొగాట్ వైదొలగడంతో ఇండియా టీమ్లో చోటు దక్కించుకుంది.57 కేజీ బౌట్లో సరిత బెర్తు దక్కించుకుంది.76 కేజీకి మారిన కక్రాన్ ఆసియా ట్రయల్స్లో తనను ఓడించిన రైల్వేస్ రెజ్లర్ కిరణ్పై ప్రతీకారం తీర్చుకొని క్వాలిఫై అయింది.