అంటిగ్వా: వెస్టిండీస్తో తొలి టెస్ట్లో రికార్డు విక్టరీని టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే టెస్ట్ను ముగించిన కోహ్లీసేన మ్యాచ్ తర్వాత లభించిన బ్రేక్ టైమ్లో కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా సేదతీరుతోంది. కెప్టెన్ విరాట్.. తన భార్య అనుష్క, టీమ్మేట్స్ లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్తో కలిసి ఓ క్రూయిజ్లో సముద్ర విహారినికి వెళ్లాడు. కనుచూపుమేర నీలి రంగులో సముద్ర అలలు కనిపిస్తుండగా.. క్రూయిజ్లో కూర్చొని అందరు విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటోను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి ‘ఎండ్లెస్ బ్లూస్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోను షేర్ చేసిన అశ్విన్.. ‘సముద్రం.. సూర్యాస్తమయం.. అద్భుతమైన కాంబినేషన్’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అంటిగ్వాలోని జాలీ హార్బర్ బీచ్లో జెట్స్కీ రైడింగ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.