హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదని ఏపీ వాదించింది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్కు స్పెసిఫిక్ కేటాయింపులు జరిగిపోయాయని స్పష్టం చేసింది. గురువారం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో ఏపీ తన వాదనలను కొనసాగించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్ 9 కింద తుంగభద్ర లెఫ్ట్ కెనాల్కు 29.5 టీఎంసీలు, హైలెవెల్ కెనాల్కు 32.5 టీఎంసీలు కేటాయించిందని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించింది.
ఆ కోటాను మార్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదని పేర్కొంది. లో లెవెల్ కెనాల్ కింద 1.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, కానీ తెలంగాణ ఆ ఆయకట్టును 1.5 లక్షల ఎకరాలకు కుదించిందని తెలిపింది. 8 వేల ఎకరాలు కోత పెట్టడం కరెక్ట్ కాదని పేర్కొంది. మరోవైపు క్రాప్ డేస్ 152 రోజులని, అయితే.. 135 రోజులే తీసుకోవాలంటూ షరతు పెట్టడం కరెక్ట్ కాదని వాదించింది.

