ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ నేతల భేటీ రద్దయ్యింది. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్.. తనను కలిసేందుకు టీడీపీ నేతలకు ఉదయం 9.45గం.కు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై వాదనలు జరుగుతోన్న క్రమంలో ఈ అపాయింట్మెంట్ ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు టీడీపీ నేతలకు సమాచారం అందించినట్లుగా సమాచారం. కాగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు శనివారం అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ అది ఆదివారానికి వాయిదా పడింది. తాజాగా రద్దై్ంది.