జనసేన గాలి పార్టీ... అందుకే టీడీపీ జండా మోస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్​

జనసేన గాలి పార్టీ... అందుకే టీడీపీ జండా మోస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్​

టీడీపీ, జపసేన పార్టీల గురించి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్​ సంచలన కామెంట్స్​ చేశారు. పవన్ కల్యాణ్ సీటు కూడా చంద్రబాబు డిసైట్ చేస్తారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. జనసేన భవిష్యత్ ను లోకేశ్ డిసైడ్ చేస్తున్నారని తెలిపారు. జనసేన గాలి పార్టీ కనుకే టీడీపీ జెండాలు మోస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ పదవి గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించడమే ఆ రెండు పార్టీల పరిస్థితికి నిదర్శనం అన్నారు. ఎన్నికల హామీకి కట్టుబడి పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ ను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.2024 ఎన్నికలు తరువాత  ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమేనన్నారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి అమర్​ నాథ్​ అన్నారు.   ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మారాను తప్ప జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదని అన్నారు.

ఇక  వైసీపీ ఎమ్మెల్యే సీట్ల మార్పు విషయంలో సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదని మంత్రి చెప్పారు.రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు మంత్రి గుడివాడ అమర్​ నాథ్​ రెడ్డి .. ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకరు, ఇద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అమాయకత్వమేనని మంత్రి తెలిపారు.