- విడుదలకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.1,209.60 కోట్ల విడుదలకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను తెలంగాణ, మేఘాలయ, చత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్కు అందించనుంది. అలాగే ఏపీతో కలిపి మరో 15 రాష్ట్రాలకు రూ.4, 984 కోట్లను రిలీజ్ చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇందులో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 19 రాష్ట్రాలకు రూ.6,194.40 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారని కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.