మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం

మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
  • కో-  ఆర్డినేటర్ గా ఐఎన్టీయూసీ  రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ 

బషీర్ బాగ్,వెలుగు : మల్కాజిగిరి లోక్ సభ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కో- – ఆర్డినేటర్ గా ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ ను నియమించినట్లు  పీసీసీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. నాంపల్లిలోని గాంధీ భవన్ లో ఆదివారం జరిగిన పీసీసీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  

మల్కాజిగిరికి గుంజ శ్రీనివాస్ తోపాటు కమిటీ ఇన చార్జ్ గా పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్ జీ వినోద్ రెడ్డి, కో- – ఆర్డినేటర్లుగా పార్టీ నేతలు జి. నరసింహ గౌడ్, మంజులరెడ్డి, జి. రాఘవేంద్ర, కె. చిన్నారెడ్డిలను నియమించినట్లు పేర్కొన్నారు. అనంతరం గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై బాధ్యతను పెట్టినందుకు, మల్కాజిగిరిలో ఇన్ చార్జ్ మైనంపల్లి  ఆదేశానుసారం పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.