నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..

నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్ తేజ ఆరోగ్యం నిలకడగానే ఉందని  డాక్టర్లు వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు అతనికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కాలర్ బోన్ విరిగిందని..ఆందోళన అవసరం లేదన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని..మరో 48 గంటలు డాక్టర్లు పర్యవేక్షించాలన్నారు.

నిన్న (శుక్రవారం) రాత్రి 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై.. స్పోర్ట్స్ బైక్ పై నుంచి పడటంతో.. తీవ్రగాయాలు అయ్యాయి.  పోలీసులు యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ రిలీజ్ చేశారు.  మాదాపూర్ రోడ్డుపై  బైక్ పై స్పీడ్ గా వస్తున్న సాయిధరమ్ తేజ్ తన ముందున్న బైక్,ఆటోను ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయి పడ్డాడు. కిందపడిన సాయిధరమ్ తేజ్ కొంతదూరం వరకు జారిపడ్డాడు.  ఆ సమయంలో సాయిధరమ్ తేజ్ ఛాతి, పొట్ట, కంటి భాగంలో గాయాలు అయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ లో సాయిధరమ్ తేజ్  స్పృహ కోల్పోయాడు.