
అర్జున్ రెడ్డి’ ప్రేయసిగా క్యూట్ , ఇన్నోసెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది షాలినీ పాండే. అందుకే ఆమెను మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నిశ్శబ్దం, ఇద్దరిలోకం ఒకటే చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు అంతకు మించిన చాన్స్ ఒకటి సంపాదించింది. అది కూడా బాలీవుడ్ లో. రణ్ వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్ ’లోషాలినీని హీరోయిన్ గా ప్రకటించారు. ఈ విషయమై నిర్మాత మనీష్ శర్మ మాట్లాడుతూ ‘మా స్క్రిప్ట్ ప్రకారం హీరోయిన్ గా ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి.ఆడిషన్స్లో షాలినీని చూడగానే తనే మా హీరోయిన్ అని ఫిక్సైపోయాం. తన టాలెంట్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది’అన్నారు .
నిజానికి షాలిని తెలుగువారి కంటే ముందు నార్త్ వారికే బాగా పరిచయం. సినిమాల్లోకి రాకముందు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో కొన్నినాటకాలకు పని చేసిందామె. ‘మేరీనిమ్మో’ అనే సినిమాతో పాటు కొన్ని టీవీ షోస్లో కూడానటించింది.కాకపోతే ఇప్పుడుహీరోయిన్ గా అక్కడ అడుగు పెడుతోంది.అది కూడా సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయినరణ్ వీర్ సింగ్తో కలిసి నటించనుంది. మరి జయేష్భాయ్తో ఆమె జోడీ ఎలా ఉంటుందో, ఆ సినిమా షాలినికెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో..