
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినందున కొత్తగా డిజిటల్కార్డులు అందజేయాలని, ఇందుకోసం లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆయన ఆరోగ్య శ్రీ బోర్డు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిమ్స్స్పెషలిస్టులతో ఆరోగ్య శ్రీ కేసులను మెడికల్ఆడిట్చేయించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
కరోనా టైంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ఫంగస్సర్జరీలు చేసిన కోఠి ఈఎన్టీ హాస్పిటల్కు రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మూగ, చెవిటి పిల్లలకు కాక్లియర్ఇంప్లాంట్సర్జరీలను వరంగల్ఎంజీఎంలో అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డయాలసిస్సేవలను మరింత నాణ్యతతో అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్రూపొందించడానికి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.ఆరోగ్య శ్రీ రోగులకు ఫేస్రికగ్నైజేషన్సాఫ్ట్వేర్వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.