ఆరోగ్య శ్రీ డిజిటల్​ కార్డులు .. లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి : హరీశ్​రావు

ఆరోగ్య శ్రీ డిజిటల్​ కార్డులు .. లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి : హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినందున కొత్తగా డిజిటల్​కార్డులు అందజేయాలని, ఇందుకోసం లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. మంగళవారం ఆయన ఆరోగ్య శ్రీ బోర్డు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిమ్స్​స్పెషలిస్టులతో ఆరోగ్య శ్రీ కేసులను మెడికల్​ఆడిట్​చేయించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. 

కరోనా టైంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్​ఫంగస్​సర్జరీలు చేసిన కోఠి ఈఎన్టీ హాస్పిటల్​కు రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మూగ, చెవిటి పిల్లలకు కాక్లియర్​ఇంప్లాంట్​సర్జరీలను వరంగల్​ఎంజీఎంలో అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  డయాలసిస్​సేవలను మరింత నాణ్యతతో అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్​వేర్​రూపొందించడానికి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.ఆరోగ్య శ్రీ రోగులకు ఫేస్​రికగ్నైజేషన్​సాఫ్ట్​వేర్​వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.