అసదుద్దీన్ ఓవైసీ మరో జిన్నా.. ముస్లింల మధ్య చీలికకు యత్నం

అసదుద్దీన్ ఓవైసీ మరో జిన్నా.. ముస్లింల మధ్య చీలికకు యత్నం

లక్నో: ప్రముఖ ఉర్దూ కవి మున్నావర్ రానా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో అసదుద్దీన్‌‌ను పోల్చిన మున్నావర్.. ఇలాంటి నేతలు ముస్లింల మధ్య చీలికలు తీసుకొచ్చి, కమ్యూనిటీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో జిన్నా లాంటి అసదుద్దీన్‌‌ ఎదుగుదలను ముస్లిం కమ్యూనిటీ అడ్డుకోవాలని రానా కోరారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచిన నేపథ్యంలో మున్నావర్ రానా పైవ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం వల్ల ఆర్జేడీ కూటమి ఓట్లు చీలిపోయాయని.. తద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరిందన్నారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ముస్లింల ఓట్లను ఓవైసీ చీలుస్తున్నారని రానా ఆరోపించారు.