ఓల్డ్ సిటీలో బీజేపీ పప్పులు ఉడకవు: అసదుద్దీన్ ఓవైసీ

ఓల్డ్ సిటీలో బీజేపీ పప్పులు ఉడకవు: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం  హైదరాబాద్ లో జరిగిన పార్టీ వేడుకలో మాట్లాడుతూ.. బీజేపీ పప్పులు ఓల్డ్ సిటీలో ఉడకవని అన్నారు. బల్దియా ఎన్నికల్లో MIMను ఓడించటానికి ఓల్డ్ సిటీలో యూపీ సీఎం, బీజేపీ టీమ్ అంతా దిగిందని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఓల్డ్ సిటీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారని, ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.