
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : నేటి యువత సెల్ ఫోన్లకు బానిసలై అనారోగ్యం బారిన పడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో హీరేకార్ రాహుల్, రాకేశ్ఏర్పాటు చేసిన హీరేకర్స్ స్పోర్ట్స్ జోన్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సెల్ ఫోన్లకు బానిసలై ఆటలకు దూరమైన యువతకు ఇలాంటి స్పోర్ట్స్ జో న్లు ఏర్పాటు చేసి ఆటలకు దగ్గర చేయడం సంతోషకరమన్నారు.
యూత్ సెల్ ఫోన్లతో ఆడటం మాని, ప్లే గ్రౌండ్ లో ఆడటం ఆలవాటు చేసుకోవాలని సూచించారు. ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటేనే భవిష్యత్ లో ఉద్యోగం, ఉపాధి రంగాల్లో రాణిస్తారన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ బ్యాటింగ్ చేసి ఉత్సాహ పరిచారు.