న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా బంధువులపై గత నెలలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను అరెస్ట్ చేశామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఇంటర్ స్టేట్ గ్యాంగ్ క్రిమినల్స్ను పట్టుకున్నామని, మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీజీపీ దిన్కర్ గుప్తా చెప్పారు. నిందితుల నుంచి ఒక గోల్డ్ రింగ్, గోల్డ్ చైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సావన్, ముహబ్బత్, షారుఖ్ ఖాన్గా గుర్తించారు. గత నెల 19న జరిగిన దాడిలో రైనా అంకుల్ అశోక్ కుమార్ చనిపోయారు. ఆయన కుమారుడు కౌషల్ కుమార్ గాయాలకు చికిత్స పొందుతూ గత నెల 31న మృతి చెందారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న కౌషల్ భార్య ఆశా రాణి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో గాయపడ్డ మరో ఇద్దరు రైనా కుటుంబీకులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పంజాబ్ సీఎం అమరిందర్ స్పందించారు. ఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకోవాల్సిందిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ)ను ఆదేశించారు. రంగంలోకి దిగిన సిట్ అధికారులు నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.
రైనా బంధువుల హత్య కేసు.. ముగ్గురు నిందితుల పట్టివేత
- దేశం
- September 16, 2020
లేటెస్ట్
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ
- తెలంగాణలో మే 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వన్డే, టీ20ల్లో టాప్లోనే టీమిండియా
- గెలుపొటములను తేల్చేది యూత్ ఓటర్లే
- 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
- ముంబై బై .. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
- నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు
- చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : రంజిత్రెడ్డి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్