వన్డే, టీ20ల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టీమిండియా

వన్డే, టీ20ల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టీమిండియా
  • టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నం.1గా ఆస్ట్రేలియా

దుబాయ్: ఇంటర్నేషనల్ వన్డే, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకుంది. వార్షిక అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ తర్వాత  టెస్టుల్లో మాత్రం అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. టెస్టుల్లో 2020 డిసెంబర్ నుంచి 2021 వరకు ఫలితాలను  మినహాయించి 2021 మే తర్వాత ఆడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ శుక్రవారం ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

ఈ క్రమంలో 124 పాయింట్లతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. ఇండియా 120 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. వార్షిక అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ తర్వాత కూడా ఇండియా వన్డే, టీ20ల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నిలిచింది. వన్డేల్లో ఇండియా (122) , ఆస్ట్రేలియా (116), సౌతాఫ్రికా (112) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3లో నిలిచాయి. టీ20ల్లో ఇండియా 264 పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగుతుండగా ఆస్ట్రేలియా (257) రెండో స్థానంలో ఉంది.