చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : రంజిత్​రెడ్డి

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : రంజిత్​రెడ్డి
  • లోక్​సభ ఎన్నికలను కార్యకర్తలు చాలెంజ్​గా తీసుకోవాలి
  • చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

శంషాబాద్/గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి బూత్ కోఆర్డినేటర్ లోక్​సభ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకోవాలని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి సూచించారు. చేవెళ్లలో కాంగ్రెస్ ​జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్​ హాల్​లో శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్​స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

చేవెళ్ల ఇన్​చార్జ్ వేంనరేందర్​రెడ్డి, హైదరాబాద్ ​మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్​ నేత ఫహీంతో కలిసి రంజిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు అమలు చేశామని, త్వరలో మిగిలిన రెండు అమలు చేస్తామన్నారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఒక్కో కోఆర్డినేటర్‌‌‌‌కు ఒక బూత్ ఇచ్చామని, చురుకుగా పనిచేసే వాళ్లకు బూత్‌‌‌‌లు అప్పగించాలని సూచించారు.

బూత్ కమిటీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్​చార్జ్​తో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే అత్తాపూర్​లోని ఓ కన్వెన్షన్ ​సెంటర్​లో శుక్రవారం నిర్వహించిన యూత్​ కాంగ్రెస్ ​యువ సమ్మేళనంలో రంజిత్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌‌‌‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ కోటి ఉద్యోగాలు అంటూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదని, తమకు కూడా దేవుడేనని చెప్పారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డిౖ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్​విసిరారు. సినీ నిర్మాత బండ్ల గణేష్, స్టేట్​యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.