రాజేంద్రనగర్లో కత్తి పోట్ల కలకలం.. విచక్షణారహితంగా దాడి

రాజేంద్రనగర్లో కత్తి పోట్ల కలకలం..  విచక్షణారహితంగా  దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కత్తి పోట్ల కలకలం సృష్టించాయి.  మార్చి 12వతేదీ మంగళవారం తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి దిగారు. విచక్షణారహితంగా నితీష్ పై కత్తితో దాడి చేశారు దుండగులు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోని ఎన్ఎమ్  గూడ చౌరస్తా లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు నితీష్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  కేసు నమోదు చేసుకున్నారు.  సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ స్టార్ రెస్టారెంట్ లో నితీష్ వెయిటర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.