యూపీ బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి

యూపీ బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని అధికార BJP ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. బుధానా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణించిన వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. ముజఫర్‌నగర్‌లోని సిసౌలిలో శనివారం ఈ ఘటన జరిగింది. జన కళ్యాణ్‌ సమితి కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ కారుపై నిరసనకారులు దాడి చేశారు. రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకోలేకపోయారు. దీంతో ఉమేష్‌ మాలిక్‌ పోలీసుల రక్షణ మధ్య తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.