మానకొండూర్: కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలంలోని ఊటూర్ ఎస్బీఐ బ్యాంక్లో దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంక్ షటర్ల తాళాలు పగలగొట్టి లోపలకు చొరబడేందుకు యత్నించిన దొంగలు విఫలమయ్యారు. సమాచారం అందుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయసారధి, మానకొండూర్ సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దొంగతనానికి సంబంధించిన ఆధారాలను సీసీ కెమెరాల్లో పరిశీలించారు.
చోరీకి యత్నించిన దొంగలు గతంలో ఏదైనా బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడ్డారా అనే కోణంలో ఫింగర్ ప్రింట్స్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. బ్యాంక్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొన్న సీపీ కమలాసన్ రెడ్డి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.