- సీఎస్సార్ ఫండ్ కింద రూ.10 కోట్లు ఇచ్చిన అరబిందో ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ
కొడంగల్, వెలుగు: కొడంగల్పట్టణంలోని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ఫౌండేషన్ ఇంటిగ్రెటేడ్సెంట్రలైజ్డ్ కిచెన్ఆధునీకరణకు అరబిందో ఫార్మా ముందుకొచ్చింది. గురువారం సీఎం రేవంత్రెడ్డిని కలిసిన ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ నిత్యానంద రెడ్డి రూ.10 కోట్ల సీఎస్సార్ ఫండ్ కు సంబంధించిన చెక్కును అందజేశారు.
ఇందులో కొడంగల్ ఇంటిగ్రేటెట్కిచెన్ కు రూ.4 కోట్లు వినియోగించనున్నట్లు ఫౌండేషన్ప్రతినిధులు తెలిపారు. కొడంగల్ ఇంటిగ్రేటెట్ కిచెన్ద్వారా వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని 14 మండలాల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందిస్తున్నారు.
