హైదరాబాద్, వెలుగు: అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ థెరానిమ్ బయోలాజిక్స్ సింగపూర్కు చెందిన ఎంఎస్డీతో కీలక ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా 175 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మెదక్ జిల్లా హత్నూరలో ప్లాంటును నిర్మిస్తుంది. ఇందులో 60 వేల లీటర్ల సామర్థ్యంతో రియాక్టర్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మందుల తయారీకి అవసరమైన పదార్థాలు తయారు చేస్తారు.

