ఐర్లాండ్ పై 42 ర‌న్స్ తేడాతో ఆసీస్ విక్టరీ

ఐర్లాండ్  పై 42 ర‌న్స్ తేడాతో ఆసీస్ విక్టరీ

టీ20 ప్రపంచకప్ లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా  ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో  ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది.  దీంతో గ్రూపు వన్లో ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంది.  ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది.  ఆరోన్ ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేసి ఐర్లాండ్  ముందు భారీ టార్గెట్ నిలిపాడు. 

ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 18.1 ఓవ‌ర్లలో 137 ర‌న్స్‌కు ఆలౌటైంది.  ముందుగా 25 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లను ఐర్లాండ్ కోల్పోయింది.  లోర్సన్  ట‌క‌్కర్ (71) ఒక్కడే అత్యధిక పరుగులు చేశాడు. అతనికి మిగతా ఆటగాళ్ల సహకారం లభించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో  పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.